వేసవి తాపం తీవ్రంగా ఉంది . మనుష్యులతో పాటు జంతువులు , పక్షులు కూడా వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్నాయి. మరి జంతువులు, పక్షులకు కూడా మనం దాహార్తిని తీర్చడానికి ఏదైనా చేస్తే బాగుంటుంది కదా!
ఇదే ఆలోచన విజయనగరం జిల్లా , గరుగుబిల్లి మండలం, బంటువానివలస ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులకు , విద్యార్థులకు వచ్చింది. వారు ఏమి చేశారో చూడండి.
చిన్న చిన్న గ్లాసులతో నీటిని నింపి చెట్లకు అతికించారు.
ఆ నీటిని ఉడతలు ఎలా తాగుతున్నాయో చూడండి .
మీరు కూడా ప్రయత్నిస్తారా?
అనుపోజు సరస్వతి
టీచర్
ఎం పి పి స్కూల్ బంటువాని వలస
గరుగుబిల్లి మండలం




1 Comments